దేవుడంటే భక్తి లేదు… హిందువుల మనోభావాలంటే గౌరవం లేదు… అధికారంలో ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని అవమానించి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడినే వాడుకుంటున్నది జగన్ రెడ్డి ముఠా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో దేవదేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి కి క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి 11 మంది మిగిలారని, టిటిడి కల్తీ లడ్డు వ్యవహారం లో చేస్తున్న చేష్టలకు దేవ దేవుడు మీద అవాక్కులు మాట్లాడుతున్న వైసీపీ కి
ఈ సారి టెన్నిస్ ఆడుకోవడానికి రెండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చో పెడతారన్నారు వంశీ కృష్ణ శ్రీనివాస్ , విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు






Comments (0)
Be the first to comment