|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాల ఇన్పుట్ సబ్సిడీని నెలల వ్యవధిలోనే అందించడం గొప్ప విశేషం
|
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారంతాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వైఎస్ఆర్ రైతుభరోసా- పీఎం కిసాన్ రెండో విడత నగదును విడుదలచేశారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి రైతుకు వ్యవసాయ పెట్టుబడి సాయం చేయడమేప్రభుత్వ లక్ష్యమని , వ్యవసాయ , కౌలు ,అటవీ భూములు ఆర్ ఓ ఎఫ్ ఆర్ రైతులకు , అసైన్డ్భూములను సాగుచేసుకుంటున్న రైతులకు, కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగాఅర్హులందరికీ మేలు అయ్యేవిధంగా వారి ఖాతా లకు జమ చేయడం జరుగుతుందన్నారు.
వీడియోకాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతు భరోసాపథకం రైతుల పాలిట వరం అని దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఆర్థిక సాయం
అందిస్తున్నారన్నారు. తన పాదయాత్రలో రైతులకష్టాలను కళ్లారా చూసి, ఎన్నికలమ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికిరూ 12,500/- తోపాటు అదనంగా వెయ్యి రూపాయలు మొత్తం రూ 13,500/-ఇస్తున్నారన్నారు. రైతు భరోసా వలన సీజన్లో సన్న,చిన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి కి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.సెప్టెంబర్ మాసం లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాల ఇన్పుట్ సబ్సిడీనినెలల వ్యవధిలోనే అందించడం గొప్ప విశేషం అన్నారు. సకాలంలో రైతులకు పెట్టుబడిఅందించడం ద్వారా వారు బయట అధిక వడ్డీలకు అప్పులు తేవడం , పొలాలుతాకట్టు పెట్టడం , ఫైనాన్స్ దగ్గరకి వెళ్లే బాధల నుండివిముక్తి లభించిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి , ధరలస్థిరీకరణ చేయడం, కల్తీ లేని ఎరువులు, నాణ్యమైనవిత్తనాలను రైతుల ఇళ్ల వద్దకే నేరుగా అందించడంజరుగుతుందన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు, వైయస్సార్ జలకళ ద్వారా ఉచిత బోర్లు వేయడం ద్వారా రైతులకు భద్రత , భరోసా కల్పించారన్నారు. మనకు అన్నం పెడుతున్న రైతుల జీవితాల్లో మనముఖ్యమంత్రి చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో అతిశయోక్తిలేదు అన్నారు.
జిల్లాకలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఈ సంవత్సరంఅక్టోబర్ నాటికి జిల్లాలో 3,80,991 మంది అర్హులైన రైతు కుటుంబాలకు వారి ఖాతాలో రూ 90.02కోట్లు జమ చేయడం జరుగుతుందన్నారు. వీరిలో వ్యవసాయ , కౌలు, దేవాదాయ, అసైన్డ్మరియు అటవీ భూముల రైతులకు వర్తిస్తుందనీ నేరుగా వారి ఖాతాలో నగదు జమ అవుతుందనితెలిపారు.
రైతుభరోసా పథకం లబ్ధిదారులు కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీకి చెందిన మొట్టడం కాసులమ్మమాట్లాడుతూ తాము వరి తో పాటు అపరాల సాగు చేసుకుంటున్నామన్నారు. మా కుటుంబంపడుతున్న కష్టాలను జగనన్న గుర్తించి రైతు భరోసా పథకం కింద మే నెలలో రూ 7,500/-,ఈ నెలలో రూ4000/- నగదుబ్యాంకులో జమ చేశారన్నారు. గతంలోతాము చాలా ఇబ్బందులు పడ్డామని వ్యవసాయం చేసుకోడం కోసం బయటఎక్కువ వడ్డీ లకు అప్పులుచేసేవారమని, ఇటువంటి సమయంలో జగనన్న ఆపద్బాంధవుడి లా ఆదుకున్నారని వారికిఎప్పటికీ రుణ పడి ఉంటామన్నారు.
|
|
Tuesday, October 27, 2020 10/27/2020 3:01:44 PM
|
Keywords |
Raithu Bharosa, Vasupalli Ganesh Kumar,
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|