శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతా కం మీద చింతా వరలక్ష్మి సమర్పణలో నిర్మాతలు చింతా వినీషా రెడ్డి మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "శ్రీ చిదంబరం గారు". వినయ్ రత్నం దర్శకత్వంలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ చిత్ర విశేషాలను, భవిష్యత్తు ప్రణాళికలను మీడియా ముఖంగా పంచుకోవడానికి చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం హోటల్ గ్రీన్ పార్క్ లో ఏర్పాటు చేసింది. ' శ్రీ చిదంబరం గారు’ మూవీ ప్రెస్ మీట్ జరిగింది.
హీరో వంశీ తుమ్మల మాట్లాడుతూ,
ఈ సినిమా తన మొదటి సినిమా అని పేర్కొన్నారు. తన స్వస్థలం రాజమండ్రి అని గుర్తు చేశారు. విశాఖ లో తిరిగాను అని గుర్తు చేశారు. ఇందులో తన పాత్ర అబద్రత భావం తో ఉంటుంది అన్నారు. సినిమా లో తాను మెల్లకన్ను పాత్ర ఫోషోంచాను అన్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన క సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందన్నారు. మంచి లవ్ స్టోరీ అవుతుంది అని వివరించారు. అందరూ చూడాల్సిన సినిమా అన్నారు.
హీరోయిన్ సంధ్యా వశిష్ట మాట్లాడుతూ,
చిత్ర ప్రమోషన్ నిమిత్తం విజయవాడ, రాజమండ్రి, విశాఖ వచ్చాం అన్నారు. చిత్ర షూటింగ్ లో మంచి వైబ్ వచ్చింది అన్నారు. షూటింగ్ పాజిటివ్ గా జరిగింది లీలా సురేష్ చిదంబరం పాత్రలు ఆకట్టుకుంటాయి తాను బెంగళూరు కి చెందిన అమ్మాయి అని తెలిపారు. తన పాత్ర కోసం గోదావరి స్లాంగ్ ప్రాక్టీస్ చేశాను అన్నారు.
దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ,
ఫిబ్రవరి 6 న ఈ సినిమా విడుదల అవుతుందన్నారు. కుటుంబ సమెతంగా చూడదగ్గ లవ్ స్టోరీ అన్నారు. నిజమైన ప్రేమ అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి సమాజంలో జరిగిన కంపెరిజన సంఘటనలు ఆధారంగా ఐదు పాటలు ఉంటాయి. ఒక పాట కీరవాణి పాడారు అని గుర్తు చేశారు. కేవలం 32 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేసాము అన్నారు. ఈ సినిమా కి నిర్మాతలుగా చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి వ్యవహారించారు అని తెలిపారు.
కంటెంట్ రైటర్గో పినాధ్ మాట్లాడుతూ,
అబద్రత భావం వదిలేస్తే జీవితంలో పైకి వస్తారు అని సినిమా ద్వారా చెప్పాము అన్నారు.






Comments (0)
Be the first to comment