విశాఖ జిల్లా లోని జివిఎంసి పరిధిలో తగరపువలస వెంకటేశ్వర మెట్ట వద్ద తాగునీటి పైపు లైన్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, క్రీడా, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.
జివిఎంసి పరిధిలోగల గోస్తని హెడ్ వాటర్ వర్క్స్ నుంచి 400 ఎం ఎం సైజ్ పైపు లైన్ 1800 కెఎల్ గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ తగరపువలస వరకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 980 లక్షలతో ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైపులైన్ ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు.
ముందుగా తగరపువలస నుంచి జివిఎంసి పరిధి మూడో వార్డు భీమిలి సెంటర్ వరకు దాదాపుగా ఐదు కిలోమీటర్ల వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తగరపువలస సెంటర్ లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం నవరత్నాలు -
పేదలందరికి ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల స్థలాల పట్టాలను మంత్రి అందించారు.
ఈ కార్యక్రమంలో ఙివిఎంసి పరిధిలోని 1,2,3,4, వార్డులకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ,
భీమిలీ నియోజకవర్గం లో
ఙివిఎంసి పరిధిలోని 1,2,3 వార్డులలో, 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 40 కోట్ల రూపాయలను సంక్షేమానికి కేటాయించామని అన్నారు.
విశాఖ పరిపాలన రాజధాని అవుతున్న తరుణంలో
భీమిలి నుంచి భోగాపురం వరకు 6 లైన్స్ రోడ్ల నిర్మాణం జరగనుందని దీంతో భీమిలీ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రతి పథకం, అర్హత ఉందో లేదో చూసి ఇస్తున్నామని, కుల, మతాలకు అతీతంగా ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఒక నూతన అధ్యాయం మొదలైందని, ప్రతి ఇంటికి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం, రవాణా ట్రక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
మహాయజ్ఞం లాగా గత నెల 25 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమీషనర్ జి.సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు.